సూర్యాపేట : కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను దేశంలోనే నంబర్వన్గా తీర్చిదిద్దిన కేసీఆర్ నాయకత్వం లేని తెలంగాణను ప్రజలు ఊహించుకోలేకపోతున్నారని సూర్యాపేట(Suryapet) ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagdish Reddy) అన్నారు. మంగళవారం స్థానిక సుమంగళి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల(BRS workers) సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జోగులాంబ నుంచి ఆలంపూర్ వరకు అందరూ బీఆర్ఎస్ అభ్యర్థులు ఓటమి పాలనప్పటికీ సూర్యాపేట మాత్రం బొడ్రాయిలా నిలిచి గెలిచిందని, వచ్చే ఎన్నికల వరకు ఒక్కటి లేకుండా అన్ని గెలుస్తామన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు జరిగిన లోటుపాట్లను ఆలోచన చేసుకావాలని అవి మరలా పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు.
ప్రజలు మనకు ప్రతిపక్ష బాధ్యతను ఇచ్చారని ప్రజల ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు పోవాలన్నారు.
అధికారం ఉన్న లేకున్నా అనుగమనిగి ఉండడం రాజకీయంగా తరగని పెట్టుబడి అని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై వారంలో స్పష్టత వస్తుందని దానిపై ఆలోచన చేద్దామన్నారు. ప్రజలు విజ్ఞులని వారు ఆలోచన చేస్తారని, మన ప్రధాన బాధ్యత పార్టీ ఏ పిలుపునిచ్చినా వెంటనే స్పందించాలన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల తరఫున పోరాడటమే మన ప్రధాన కర్తవ్యమని, దీన్ని నాయకులు, కార్యకర్తలు దృష్టిలో ఉంచుకొని చైతన్యవంతులై పని చేయాలని పిలుపునిచ్చారు.