హాలియా/భూదాన్ పోచంపల్లి, మార్చి 22 : నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నా కాంగ్రెస్ పాలకులు పట్టించుకోవడం లేదని, వారి ధ్యాసంతా రాజకీయాలపైనే ఉన్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు తప్పిదంతో ఒక మడి ఎండిపోతేనే నానా హంగామా చేసిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు నీళ్లు లేక ఎండిపోతున్న పొలాలపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం అంతమ్మగూడెం, ధోతి గూడెం, నల్లగొండ జిల్లా అనుముల మండలం చల్మారెడ్డిగూడెం, కొట్టాల గ్రామాల్లో నీళ్లు లేక ఎండిపోయిన వరి పొలాలను శుక్రవారం ఆయన ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, యాదాద్రి భువనగిరి జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నోముల భగత్కుమార్, రవీంద్రకుమార్, బూడిద భిక్షమయ్యగౌడ్, ట్రైకార్ మాజీ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్నాయక్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర్రెడ్డితో కలిసి పరిశీలించారు. సూర్యాపేట మండలం దుబ్బతండాలో పర్యటించిన సం దర్భంగా కాంగ్రెస్ నేతల బెదిరింపుల విషయా న్ని తండాకు చెందిన మహిళా రైతులు జగదీశ్ రెడ్డికి మొరపెట్టుకోగా సదరు వీడియో శుక్ర వారం వైరల్ అయింది. ఎమ్మెల్యేతో మహిళా, పురుష రైతుల సంభాషణ.. ‘మీ ప్రభుత్వం ఉన్నంత కాలం పుష్కలంగా నీళ్లు వచ్చినై. చెరువులు నిండా నిండినాయి. పంటలు పుష్కలంగా పండించుకున్నాం. కానీ ఇయ్యాల నీళ్లకు దిక్కేలేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నీళ్లు వదలాలని చెప్పాలంటే కాంగ్రెస్ వాల్లు ఎవ్వరూ రావడం లేదని, మీరు పంటలను పరిశీలించేందుకు వస్తే మీకు నీళ్లు రావట్లేదని, పంటలు ఎండిపోతున్నాయని ఎవ్వరూ చెప్పవద్దు’ అంటూహుకుం జారీ చేయడంతో భయాందోళనలకు గురౌతున్నా మని ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి దృష్టికి తీసుకు వచ్చారు. వారి ఆవేదనపై ఎమ్మెల్యే స్పంది స్తూ.. తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు.