సూర్యాపేట : తాము అనుకున్న లక్ష్యం చేరుకునే వరకు యువత విశ్రమించకూడదు అని సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) అన్నారు. ఐటీ హబ్(IT Hub)లో ఉద్యోగాల ఎంపిక కోసం 500 మంది యువతీ యువకులకు టెక్ విజన్, షాఫ్ట్ సాప్ట్ వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు ఇస్తున్న శిక్షణను తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సెంటర్ను జగదీష్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రయత్నం చేయకుండా ఏది మన సొంతం కాదన్నారు.
తమ లక్ష్యం సాధించే వరకు రాజీ లేకుండా కృషి చేస్తే యువత ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని తెలిపారు.
విద్యార్థుల నైపుణ్యం పెంచుకోవడంలో ప్రధాన భూమిక అయిన ల్యాప్ టాప్లను ప్రముఖ సాప్ట్వేర్ సంస్థ సీజీఐ స్పాన్సర్ చేయగా, వాటిని టాస్క్ సంస్థకు జగదీష్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో సాఫ్ట్ వేర్ కంపెనీలకు చెందిన ప్రతినిధులు కొణతం సైదిరెడ్డి, యలక గోపిరెడ్డి, కొండపల్లి పవన్ రెడ్డి పాల్గొన్నారు.