సూర్యాపేట : ఎస్సారెస్పీ కింద నీళ్లు ఇస్తాం పంటలు వేసుకోండని చెప్పి మరి ప్రభుత్వం రైతులను నిలు వునా మోసం చేసింది. నేడు సూర్యాపేట(Suryapet) జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఎండిపోయిన పంట పొలాలే(Crops) దర్శనమిస్తున్నాయని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం తుంగతుర్తి మండలం వెలుగుపల్లి, మొండి కుంట తండా గ్రామాల్లో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు.
ఈ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయం, ప్రాజెక్టులు, నీళ్లపై కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీస అవగాహన లేదన్నారు. ఎస్సారెప్పీ కింద కాళేశ్వరం నీళ్లతో గత నాలుగేళ్లుగా వరుసగా రెండు పంటలకు నీళ్లు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీది. రైతులు కోట్ల రూపాయల అప్పుల్లో కురుకుపోయారు. ఆయినా ప్రభుత్వానికి సోయిలేదని మండిపడ్డారు.
ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని ఆరోపించారు. రైతుల తరఫున పేగులు తేగేదాక దాక కొట్లాడుతామని స్పష్టం చేశారు .ప్రభుత్వం మెడలు వంచి నష్టపరిహారం అందించేంతవరకు మా పోరాటం ఆగదు. ఈ సమయంలో కూడా కాళేశ్వరం లో నీళ్లు ఎత్తి పోసి నీళ్లు అందించే అవకాశం వున్నా కావాలని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు.
జిల్లా మంత్రులు ఎండిన పొలాల వద్దకు పోకుండా రేవంత్ బూట్లు తుడుస్తున్నారని ఘాటుగా విమర్శించారు. జిల్లా మంత్రులు… కోమటిరెడ్డి లాంటి చిల్లర నాయకుడుకి కేసీఆర్ని విమర్శించే స్థాయి లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే కరువు పైన సర్వే చేయించి రైతులని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్, తదితరులు ఉన్నారు.