హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) బెయిల్(Bail order) అంశంపై కాంగ్రెస్(Congress), బీజేపీలవి చిల్లర మాటలు. సుప్రీం కోర్టుని తప్పుబట్టే పద్ధతుల్లో కొంతమంది సోయి లేకుండా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (MLA Jagadish Reddy ) విమర్శించారు. కవిత బెయిల్ అంశంపై కాంగ్రెస్, బీజేపీల అనుచిత వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ నిరాధారమైన కేసని మొదటి నుంచి చెబుతున్నాం. మేం ఊహించినట్లుగానే కవిత ముత్యంలా బయటకు వచ్చింది. చరిత్రల్లో సీబీఐ, ఈడీలు నమోదు చేసిన పరమ చెత్త కేసుల్లో ఇదొకటని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్, కేజ్రీవాల్ని ఇబ్బందిపెట్టడానికే ఈ కేసు పెట్టారు. విచారణ సందర్భంగా ఆధారాలు లేకపోవడంతో ఈడీ, సీబీఐ న్యాయవాదులు ఇబ్బందిపడ్డారు.
నోట్ల కట్టలతో పట్టపగలు దొరికి అధికారం చెలాయిస్తున్న మీరు నిరాధార కేసులో కవిత బెయిల్పై వస్తే ఏడుపెందుకని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీనే మోదీకి బీ టీమ్గా పని చేస్తోంది. మోదీ దగ్గర రేవంత్కు ఉన్న ప్రాధాన్యత కిషన్ రెడ్డి, బండి సంజయ్కు లేదన్నారు. రేవంత్ సీఎం కావడం మోదీ చాయిసే. వాల్మీకి కుంభకోణంలో టీ కాంగ్రెస్ నేతల ప్రమేయం ఉన్నా బీజేపీ నేతలు ఎందుకు నోరు మెదపడంలేదని ప్రశ్నించారు.
కాంగ్రెస్, బీజేపీలు కలిసి కేసీఆర్పై అక్కసు వెళ్లగక్కి వారి బలహీనతలను బయటపెట్టుకుంటున్నారు. లిక్కర్ కేసులో రాహుల్, రేవంత్ రెడ్డి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. అయితే గియితే పీసీసీ సహా తెలంగాణ కాంగ్రెస్సే బీజేపీలో విలీనమవుతుంది. బీఆర్ఎస్ ఏ పార్టీలో విలీనం కాదని స్పష్టం చేశారు. ఎప్పటికకైనా మోదీ, రాహుల్కు ప్రత్యామ్నాయం కేసీఆరే మాత్రమేనని పేర్కొన్నారు.