సూర్యాపేట : మానవులు ఎప్పుడూ ప్రేమను, కరుణను, క్షమను కలిగి ఉండాలని ఏసు క్రీస్తు(Jesus Christ) చేసిన బోధనలు మానవాళికి అనుసరణీయమని ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి(MLA Jagadish Reddy) తెలిపారు. సూర్యాపేటలోని లివింగ్ గాడ్ బాప్టిస్ట్ చర్చిలో క్రిస్మస్ను పురస్కరించుకొని పాస్టర్లకు, సువార్తికులకు, పాస్టర్స్ ఫెలోషిప్ జిల్లా చైర్మన్ మామిడి సామ్సన్ ఆధ్వర్యంలో జరిగి బట్టల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య ముఖ్యఅతిథిగా హాజరై దుస్తులను పంపిణీ చేశారు. పాస్టర్లతో కలిసి కేక్ ని కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ క్షమాగుణంతో సర్వ ప్రాణులను ప్రేమిస్తే యావత్ ప్రపంచం సంతోషంగా ఉంటుందన్నారు. ఏసుక్రీస్తు ఈ లోకంలోని ప్రజలందరికీ ప్రేమ, అప్యాయతను నేర్పించారని, ఎదుటివారిని ప్రేమించేగుణం మనలో ఉండాలని, ప్రతి ఒక్కరూ పరమత సహనం పాటించాలని పేర్కొన్నారు.
ప్రతి పేదవాడు పండుగ రోజు సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో గత పదేళ్లుగా కేసీఆర్ దుస్తులను పంపిణీ చేసిన, విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నో ఏళ్లుగా శాంసన్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రెవరెండ్ ఎం ప్రభుదాస్, పూర్ణ శశికాంత్, మీసాల గోవర్ధన్, మీసాల ప్రభుదాస్ ఫాదర్ మరియన్న తదితరులు పాల్గొన్నారు.