చిన్నకోడూరు,డిసెంబర్17 : సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్ మెన్ నరేష్(Constable Naresh) కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు(MLA Harish Rao) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదివారం చిన్న కోడూరు మండలం రామునిపట్ల(Ramunipatla) గ్రామంలో నరేష్ తల్లి తండ్రులను, కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చారు.
ఈ సంఘటన తీవ్రంగా కలిచివేసిందన్నారు. అధైర్య పడొద్దని అండగా ఉంటానన్నారు. అనంతరం చిన్నకోడూరు మండలం మాచాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గుర్రం రాజి రెడ్డి కుమారుడు గుర్రం భాను ఇటీవల మృతి చెందగ వారి కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యం చెప్పారు. హరీశ్రావు వెంట బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ, మండల పార్టీ ఆధ్యక్షుడు కాముని శ్రీనివాస్, ఎఫ్పీవో చైర్మన్ వెంకట్రెడ్డి, సర్పంచ్లు శ్రీనివాస్, బాబు, ఎంపీటీసీ జమున, నాయకులు రాజిరెడ్డి తదితరులు ఉన్నారు.