మెదక్ : పార్లమెంటు(Parliament)కు రక్షణ లేకపోవడం దురదృష్టకరమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(MLA Harish Rao) ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం నర్సాపూర్(Narsapur) పట్టణంలో నిర్వహించిన బీఆర్ఎస్ కృతజ్ఞత సభలో పాల్గొని మాట్లాడారు. లోక్సభలో బుధవారం జీరో అవర్ జరుగుతుండగా విజిటర్స్ గ్యాలరీ నుంచి ఇద్దరు ఆగంతకులు కిందకు దూకి గ్యాస్ను వదలడంపై మంత్రి స్పందించారు. పార్లమెంట్కే రక్షణ కల్పించని కేంద్ర ప్రభుత్వం ప్రజలను ఎలా రక్షిస్తారని ప్రశ్నించారు. దీనిపై విచారణ జరిపి భద్రత కట్టదితం చేయాలన్నారు.
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిని గెలిపించినందుకు శిరస్సు వంచి వందనం చేస్తున్న. అధికారం కోల్పోవడం కేవలం స్పీడ్ బ్రేకర్ మాత్రమే. అంతిమంగా గమ్యం చేరేది బీఆర్ఎస్ పార్టీయేనని స్పష్టం చేశారు. కార్యకర్తలకు ఎప్పుడు అందు బాటులో ఉంటూ ఫోన్ చేస్తే గంటలోపే మీ ముందుంటానని హామీనిచ్చారు. బీఆర్ఎస్ హయాంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశాం . స్థానిక ఎన్నికల్లో కష్టపడి పని చేద్దామన్నారు. అధికార పార్టీ నాయకులు మానసికంగా ఇబ్బంది పెడతారు కార్యకర్తలు ధైర్యం కోల్పోవద్దన్నారు.
రాబోయే రోజుల్లో ఎవరేంటో ప్రజలే గ్రహిస్తారు. పనితనం తప్పా పగతనం తెలియని వ్యక్తి కేసీఆర్ అని పేర్కొన్నారు. తప్పొప్పులను సవరించుకొని స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుదామన్ని వివరించారు. బీఆర్ఎస్ పార్టీకి ఒడిదుడుకులు సహజమే. కాంగ్రెస్ హామీల అమలు కోసం ప్రజల పక్షాన నిలబడతాం. కాంగ్రెస్ అభ్యర్థి సొంత మండలాల్లో బీఆర్ఎస్ పార్టీ అడ్డుకట్ట వేసింది. నర్సాపూర్లో పుకార్లను పటాపంచలు చేసి విజయం సాధించామన్నారు.