అచ్చంపేట, అక్టోబర్ 26: తనకు రాజకీయంగా జన్మనిచ్చింది సీఎం కేసీఆర్ అని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. నాగర్కర్నూల్ ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడారు. తనను ఈ స్థాయికి తీసుకొచ్చి అచ్చంపేట ప్రజల గుండెల్లో సుస్థిరస్థానాన్ని కల్పించే విధంగా ఆశీర్వదిస్తూ నాలుగోసారి తనకు బీఆర్ఎస్ బీ-ఫాం ఇచ్చిన సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు.
సీఎం కేసీఆర్ సహకారంతో అచ్చంపేటలో 60 వేల ఎకరాలకు సాగునీరు పారించుకోగలిగామని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు తెలంగాణ సర్కారు రూ.5.50 లక్షలు అందించినట్టు చెప్పారు. అసైన్డ్భూములు, ఎండోమెంట్ భూములకు హక్కులు కల్పించిన, పోడు భూములకు పట్టాలిచ్చి గిరిజనులకు అండగా నిలిచిన సీఎం కేసీఆర్ను చూసి గర్వపడుతున్నట్టు తెలిపారు.