సంగారెడ్డి : ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దాడి అత్యంత హేయమైన చర్య అని పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి(MLA Gudem Mahipal reddy), ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ భూపాల్ రెడ్డి అన్నారు. దుబ్బాకలో ఎన్నికల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రభాకర్రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు బుధవారం ఆర్సీపురం లక్ష్మి గార్డెన్స్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఓటమి భయంతోనే రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని, అశాంతిని రేకెత్తించాలని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.
రాజకీయంగా ఎదుర్కొనలేక భౌతిక దాడులకు దిగడం సరికాదని హితవుపలికారు. ఇలా దాడులు చేసే వారికి ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి హింసాత్మక దాడులకు చోటులేదని, దాడి చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి త్వరగా కోలుకొని, ఆరోగ్యంగా ప్రజల్లోకి రావాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు.