నకిరేకల్ నియోజకవర్గ వ్యాప్తంగా రైతుబంధు వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. రైతు బాంధవుడు కేసీఆర్ అంటూ రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాల్లో పాల్గొన్నారు. నకిరేకల్ మండలంలోని మంగళపల్లి గ్రామంలో నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య ఈ వారోత్సవాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు, అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు, రైతు పెట్టుబడి సాయం అందించిన ఏకైక ప్రభుత్వంగా టిఆరెస్ ఎప్పుడో సంచలనం సృష్టించిందని, ఇప్పుడు 50 వేల కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వంగా మరో మైలురాయి చేరిందని ఎమ్మెల్యే లింగయ్య అన్నారు.