వరంగల్ రూరల్ : పరకాల పట్టణంలోని ఏరియా హాస్పిటల్లో స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. హాస్పిటల్లో ఏర్పాటు చేస్తున్న కొవిడ్ వార్డు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పరకాలలో సీఎం కేసీఆర్ చొరవ, మంత్రి ఎర్రబెల్లి సహకారంతో 10 ఆక్సిజన్ బెడ్స్ తో కూడిన వార్డును ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ప్రజలందరూ ఇండ్లలోనే ఉండండి సురక్షితంగా ఉండాలని సూచించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ లాక్ డౌన్ సడలింపు సమయంలో అత్యవసరమైతేనే బయటికి రావాలన్నారు. మాస్కు తప్పకుండా ధరించి భౌతిక దూరం పాటించాలన్నారు.
మన మనోధైర్యమే మనకు బలమని, ధైర్యంగా ప్రజలు కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో చల్లా మధుసూదన్, సూపరింటెండెంట్ డా.ఆకుల సంజీవయ్య, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.