వరంగల్ : లక్ష మెజారిటీయే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పరకాల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి(MLA Challa Dharma Reddy )అన్నారు. గీసుగొండ మండలం సూర్యతండ, దూద్యతండ, రత్తిరాంతండాల్లో శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజల సంక్షేమమే అజెండాగా పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటువేసి కేసీఆర్కి మద్దతుగా నిలవాలని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు బీఆర్ఎస్ ప్రభుత్వంపై చేస్తున్న అసత్యపు గ్లోబల్ ప్రచారాలు నమ్మవద్దని ప్రజలను కోరారు.
కాంగ్రెస్ పార్టీకి ఓటెస్తే కన్నీళ్లు మిగులుతాయి తప్పా కష్టాలు తీరవన్నారు. మొదటి నుంచి ఆ పార్టీది మోసపూరిత వైఖరేనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్తోనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.