వరంగల్ : పరకాల నియోజకవర్గ పరిధిలోని గీసుకొండ మండలం కొమ్ముల గ్రామంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శనివారం పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా అర్హులైన మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతి ఏడాది ఆడపడుచులకు సీఎం కేసీఆర్ చీరలను బహుకరిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఒక లక్షా 10 వేల మంది మహిళలకు చీరలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మహిళల సంరక్షణ కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో పల్లెలు ఎంతో అభివృద్ధి చెందాయని గుర్తు చేశారు.