నల్లగొండ : సీఎం కేసీఆర్ పాలనలో ప్రతిపల్లె నేడు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నది. రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని నల్లగొండ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి(MLA Bhupal Reddy) అన్నారు. సోమవారం కనగల్ మండలం పొనుగోడులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భూపాల్ రెడ్డి మాట్లాడుతూ…కాంగ్రెస్ బుడ్డరఖాన్ రేవంత్ రెడ్డి అధికారంలోకి వస్తే 3 గంటల కరెంటు ఇస్తామని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారు.
గతంలో ఆడపిల్లను పురిట్లోనే చంపేసే రోజుల నుంచి ఆడ పిల్ల పుడితే కళ్యాణ లక్మి వస్తుందన్న సంతోషంతో తెలంగాణ ప్రజలు ఉన్నారని పేర్కొన్నారు. ఆడ పడచుల పెండ్లికి కాంగ్రెస్ నాయకులు కనీసం దస్తీ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ మూడోసారి అధికారంలోకి వస్తే ప్రతి మహికు మహిళా భృతి కింద నెలకు 3016 ఇస్తామన్నారు. పదవుల కోసమే కాంగ్రెస్ నాయకులు పని చేస్తారు. నిధులు ఉన్నా కూడా కోమటిరెడ్డి వెంటకరెడ్డి నల్గొండను అభివృద్ధి చేయలేకపోయాడు.
కానీ, సొంతంగా మాత్రం అభివృద్ధి చెందాడని విమర్శించారు. ఈ కార్యక్రమంలో చాడ కిషన్ రెడ్డి, చకిలం అనిల్ కుమార్, ఇన్చార్జి కటికం సత్తయ్య గౌడ్, సింగిల్ విండో ఛైర్మన్ దోతి శ్రీనివాస్, వంగాల సహదేవ రెడ్డి, మండల మండల అధ్యక్షుడు అయితగోని యాదయ్య, ఎంపీపీ కరీంపాషా, జెట్పీటీసీ చిట్లం వెంకటేశం, ఎంపీటీసీ పులకరం ఆండాలు, గ్రామ శాఖ అధ్యక్షుడు కట్ట ఊషయ్య, శ్రీధర్రావు, తదితరులు ఉన్నారు.