తెలంగాణ ప్రగతిభవన్ను గ్రెనేడ్స్తో పేల్చాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మండిపడ్డారు. సమ్మక్క -సారక్క సాక్షిగా ములుగులో పాదయాత్ర చేపట్టిన రేవంత్ రెడ్డి.. ప్రగతి భవన్ను గ్రెనేడ్స్ తో పేల్చాలని అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆరూరి రమేష్ తెలిపారు. పేద, బడుగు, బలహీన వర్గాల్లో మార్పు తీసుకువచ్చిన ప్రగతి భవన్ను పేల్చాలని అనడం హేయమైన చర్య అని అన్నారు.
ప్రగతిభవన్ తెలంగాణ ప్రజలకు గొప్ప గొప్ప పథకాలు అందించిదని.. ఇలాంటి భవనంపై ఈ వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మీ పార్టీయే కదా నక్సలైట్స్ లను నిషేధించింది.. అ పార్టీ పెద్దగా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేసే నీకు పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగే అర్హత ఉందా అని ఆరూరి ప్రశ్నించారు. నీకు నీ కార్యకర్తల సహకారం లేదు.
నీ పాదయాత్ర వల్లే కాంగ్రెస్ పార్టీకి కలిసి రావడం లేదని తెలిపారు.