భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అడవిలో తప్పిపోయిన మహిళ ఆచూకీ లభించింది. భూపాలపల్లి మండలం సుబ్బక్కపల్లికి చెందిన బండారి శిరీష.. రెండు రోజుల క్రితం తునికాకు సేకరణకు అడవిలోకి వెళ్లింది. ఈ క్రమంలో ఆమె తప్పిపోయింది. దీంతో రెండు రోజులుగా స్థానికులు, పోలీసులు, అటవీ సిబ్బంది అడవిలో గాలింపు చేపట్టారు. ఆమె ఆచూకీ కోసం డ్రోన్ కెమెరాల సాయంతో వెతికారు.
అయితే శనివారం ఉదయం అందాలపల్లి అడవిలో తుకునికాకు సేకరిస్తున్న కూలీలకు శిరీష కనిపింది. దీంతో వారు సుబ్బక్కపల్లి సర్పంచ్కు సమాచారం అందించారు. అధికారులు హుటాహుటిన అందాలపల్లికి చేరుకున్నారు. పూర్తిగా నీరసించిపోయిన శిరీషను అంబులెన్సులో దవాఖానకు తరలించారు.