Demu Train | నారాయణపేటలో డెము రైలుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. కాచిగూడ-కృష్ణ మధ్య చెన్నై – ముంబయి రైల్వే లైన్లో రైలు పట్టా విరిగిపోయింది. రైలు పట్టా విరిగినట్లు గుర్తించిన లోకో పైలెట్ రైలును నిలిపివేశారు. రైలులో ప్రయాణికులు లేకపోవడంతో పెను ముప్పు తప్పినట్లయ్యింది. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.