జయశంకర్ భూపాలపల్లి : సింగరేణి(Singareni)లో వారసత్వపు హక్కును తిరిగి పునరుద్ధరించిన ఘనత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్దేనని(KCR) టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి(Miryala Rajireddy) అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కేటీకే -1 ఇంక్లైన్లో టీబీజీకేఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు బడితల సమ్మయ్య అధ్యక్షతన గేట్ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజిరెడ్డి హాజరై మాట్లాడారు. ఎన్నికల్లో బాణం గుర్తుకు ఓటు వేసి టీబీజీకేఎస్ను గుర్తింపు సంఘంగా గెలిపించాలని కోరారు. సింగరేణిలో జాతీయ సంఘాలు సాధించిన హక్కులు శూన్యమన్నారు. సింగరేణిలో టీబీజీకేఎస్ గెలిస్తే కార్మికులకు ఆదాయపు పన్నును సింగరేణి యాజమాన్యంచే తిరిగి ఇప్పిస్తామని తెలిపారు.