హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్పై నకిలీపోస్టర్ను తయారుచేసి.. సోషల్మీడియాలో వెకిలిగా సర్క్యులేట్ చేసిన మైనర్ బాలుడితోపాటు, మరొకరిని నార్త్జోన్ టాస్క్ఫోర్స్, సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల ఓ రాజకీయపార్టీ ప్రేరేపించడంతో ముఖ్యమంత్రికి సంబంధించిన మార్ఫింగ్ వీడియోలను పోస్టుచేసి 7వ తరగతి బాలుడు అరెస్టయిన విషయం తెలిసిందే. తాజాగా ఓ రాజకీయనేత పేరిట ఉన్న గ్రూపులలో అదేవిధమైన ప్రచారం చేసి మరో బాలుడు వెకిలి ప్రచారంచేసి కటకటాలపాలయ్యాడు. ఇందుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ శనివారం మీడియాకు వెల్లడించారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం వెల్మకన్నెకు చెందిన భీమనపల్లి శేఖర్ వ్యవసాయదారుడు.
మర్రిగూడ మండలం కొట్టాలకు చెందిన బాలుడు(16) వనస్థలిపురంలోని బీసీ హోస్టల్లో ఉంటూ ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. వీరిద్దరూ తీన్మార్ మల్లన్న పేరిట సోషల్మీడియాలో ఉన్న వివిధ గ్రూపులలో సభ్యులుగా ఉన్నారు. బాలుడు ‘తీన్మార్ మల్లన్న ఫ్యాన్స్’ పేరుతో 9618472310 నంబర్పై వాట్సాప్లో ఓ గ్రూప్ను తయారుచేశాడు. ఈ నెల 17న తెలంగాణ ముఖ్యమంత్రికి సంబంధించిన ఒక నకిలీ వార్తను తన స్నేహితుల నుంచి రిసీవ్ చేసుకొన్నాడు. దానికి కొన్ని మార్పులు, చేర్పులు చేసి.. తీన్మార్మల్లన్న అసోసియేషన్ పేరుతో ఉన్న గ్రూప్లోకి ఫార్వర్డ్ చేశాడు. అందులో సభ్యుడిగాఉన్న శేఖర్ (6301202259) నంబర్ ద్వారా మరిన్ని గ్రూప్లకు పంపించాడు. ఆ వార్త అవాస్తవమనే విషయం తెలిసి కూడా దానిని ఫార్వర్డ్ చేశారు. నకిలీ పోస్టును తయారుచేసింది ఎవరనే విషయంపై పోలీసులు ఆరా తీయగా.. మైనర్ బాలుడు తనకు వచ్చిన పోస్టులో మార్పులు చేసినట్టు గుర్తించారు. ఉద్దేశ పూర్వకంగానే నకిలీవార్తను సర్క్యులేట్ చేసినట్టు నిర్ధారించారు. ఇద్దరినీ అరెస్టుచేసిన పోలీసులు వారి సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొన్నారు. కేసు విచారణను సైబర్క్రైమ్ ఠాణాకు అప్పగించారు.
పిల్లలతో పలు గ్రూపులు
అరెస్టయిన మైనర్ బాలుడు 10, ఇంటర్ చదువుతున్న స్నేహితులతో కలిసి తీన్మార్ మల్లన్న ఫ్యాన్స్ క్లబ్ను ఏర్పాటుచేశాడు. మైనర్లతో కలిసి పలు గ్రూపులను తయారుచేశాడు. ముఖ్యమంత్రి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాడు. తీన్మార్ మల్లన్న మాటలకు ఆకర్షితుడైన అతడు ఇప్పుడు కటకటాలు లెక్కించాల్సి వచ్చింది. అతడి తల్లిదండ్రులు రెండెకరాల పొలంతోపాటు, గొర్లను కాసుకుంటూ బాలుడిని చదివిస్తున్నారు. పిల్లలు చదువుకుని తమకు చేదోడువాదోడుగా ఉంటాడనుకుంటే.. కొంతమంది రాజకీయనేతలు వారిలో విషబీజాలు నాటుతూ బంగారు భవిష్యత్ను నాశనం చేస్తున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.