హైదరాబాద్ : రామప్ప పర్యటన ముగించుకొని హన్మకొండ ఎన్ఐటీ కలాం గెస్ట్ హౌస్కు చేరిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్తో పాటు శాసనసభ్యులు, జ్యుడిషియరి, జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. సీజేఐని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్రశర్మ, జిల్లా ప్రధాన న్యాయమూర్తి నర్సింగరావు, చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంత్, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి, నన్నపనేని నరేందర్, ఆరురి రమేశ్, శంకర్ నాయక్, చల్లా ధర్మారెడ్డి, ఒడితెల సతీశ్, సీపీ తరుణ్ జోషి, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జిలు జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఏ.రాజశేఖర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జి కం అడ్మినిస్ట్రేటివ్ జడ్జి ఆఫ్ వరంగల్ యూనిట్ జస్టిస్ పి. నవీన్ రావు, డీసీపీ పుష్ప, డీఆర్ఓ వాసుచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గెస్ట్హౌస్ లాన్లో లలిత సంగీత కచేరి ఏర్పాటు చేశారు.