ఖైరతాబాద్ ;సియాసత్ ఉర్దూ దినపత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి ఆర్థిక మంత్రి హరీశ్రావు, హోంమంత్రి మహమూద్ అలీ, ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ , ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి సంతాపం ప్రకటించారు. వీరంతా మంగళవారం లక్డీకాపూల్లోని జహీరుద్దీన్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. జహీరుద్దీన్ఖాన్ సోదరుడు జాహెద్ అలీఖాన్, ఆయన కుమారుడు అమీర్ అలీఖాన్ను ఓదార్చారు.