మహబూబాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహబూబాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి , గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ శ్రీమతి మాలోతు కవిత బుధవారం ఏర్పాట్లను పరిశీలించారు. నూతన సమీకృత కలెక్టర్ కార్యాలయ సముదాయాన్ని, జిల్లా పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ గురువారం ప్రారంభించనున్నారు.
ప్రారంభోత్సవ ఏర్పాట్లతో పాటు వసతులను, హెలిప్యాడ్ నిర్మాణాన్ని జడ్పీ చైర్పర్సన్ కుమారి బిందు, ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే శంకర్ నాయక్ తో కలిసి పరిశీలించారు. పనుల పురోగతి, ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడారు.మంత్రులతో పాటు కలెక్టర్ శశాంక, ప్రజా ప్రతినిధులు నాయకులు అధికారులు ఉన్నారు.