కరీంనగర్ : కరీంనగర్ అసెంబ్లీ మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు వెలిచాల జగపతిరావు మృతిపై రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ సంతాపం తెలియజేశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లో మృతి చెందిన జగపతిరావు భౌతికకాయాన్ని మంత్రులు సందర్శించి నివాళులు అర్పించారు.
జగపతిరావు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా, రాష్ట్ర మార్క్ఫెడ్ సంస్థ చైర్మన్ గా పనిచేసి నియోజకవర్గ అభివృద్ధికి, మార్క్ఫెడ్ సంస్థ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని పేర్కొన్నారు. ఆయన మరణం బాధాకరమని, వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు.