హైదరాబాద్ : సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలో వెయ్యికిపైగా సంక్షేమ గురుకులాలు, వేలాది హాస్టళ్లను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అత్యుత్తమ ప్రమాణాలతో పోషణతో పాటు విద్యనందిస్తున్నది. పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా విద్యార్థుకు మరింత మెరుగైన పౌష్టికాహారం అందించేందుకు మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్ సంక్షేమశాఖల ఉన్నతాధికారులతో అసెంబ్లీ కమిటీ హాలులో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సంక్షేమ గురుకులాలు, హాస్టళ్లలో మెస్ చార్జీల పెంపుపై చర్చించారు. విద్యార్థులకు మెరుగైన పౌష్టికాహారం అందించాలనే సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా శాఖాపరంగా ప్రభుత్వానికి పంపే ప్రతిపాదనలపై మంత్రులు చర్చించారు. సంక్షేమశాఖల బడ్జెట్లో మెస్ చార్జీల కేటాయింపులు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులు మంత్రులను ఆదేశించారు. అనంతరం ముగ్గురు మంత్రులు ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావును కలిసి, వివరించారు.
కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, గిరిజన సంక్షేమశాఖల కార్యదర్శలు బుర్రా వెంకటేశం, రాహుల్ బొజ్జా, క్రిస్టినా చాంగ్దు, ఎస్సీ, మైనారిటీ, గురుకలాల సొసైటీ కార్యదర్శులు రొనాల్డ్ రాస్, షపీయుల్లా, ఎంజేపీ సెక్రెటరీ మల్లయ్య బట్టు తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బడ్జెట్ బీసీ సంక్షేమశాఖకు రూ.6229, పౌరసరఫరాల శాఖకు రూ.3117కోట్లు కేటాయించినందుకు హరీశ్రావుకు ధన్యవాదాలు తెలిపారు.