హైదరాబాద్ : మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్నది. ఈ సందర్భంగా వేడుకలకు రావాలని సీఎం కేసీఆర్ను మంత్రులు ఆహ్వానించారు. మంగళవారం దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను కలిసి ఆహ్వానపత్రిక అందజేశారు.
మంత్రులతో పాటు రాష్ట్ర రైతుబంధు సమన్వయ సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినా, దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, మేడారం దేవాలయ ఈవో రాజేందర్, జాతర ధర్మకర్తల మండలి చైర్మన్ కొర్నిబెల్లి శివయ్య, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, జడ్పీ వైస్ చైర్పర్సన్ నాగజ్యోతి, దుర్గం రమణయ్య తదితరులు పాల్గొన్నారు.