హైదరాబాద్ : పీపుల్స్ ప్లాజాలో ఈ నెల 17న నిర్వహించనున్న తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల ఏర్పాట్లను మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్ పరిశీలించారు. అనంతరం ట్యాంక్ బండ్పై ఉన్న అంబేద్కర్ విగ్రహం మీదుగా ఇందిరాపార్క్ వద్ద ఎన్టీఆర్ స్టేడియంలో పర్యటించారు. హైదరాబాద్లో 17న పీపుల్స్ ప్లాజా నుంచి అంబేద్కర్ విగ్రహం మీదుగా ఎన్టీఆర్ స్టేడియం వరకు ఊరేగింపుగా చేరుకొని.. అక్కడ బహిరంగ సభకు సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని మంత్రులు తెలిపారు. కార్యక్రమం నిర్వహణపై నగర మేయర్తో పాటు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో ఏర్పాట్లను పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, రసమయి బాలకిషన్, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, గిరిజన సహకార ఆర్థికాభివృద్ధి సంస్థ చైర్మన్ రామచంద్ర నాయక్, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు.