హైదరాబాద్ : సనత్నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్పేట డివిజన్ బండ మైసమ్మనగర్లో రూ.27.20 కోట్ల వ్యయంతో 310 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం నిర్మించింది. వాటిని మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం ఉదయం ప్రారంభించనున్నారు. నిరుపేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూంలో సకల సదుపాయాలు కల్పించింది. తాగునీటికి ఇబ్బందులు లేకుండా సంప్ నిర్మాణంతో పాటు డ్రైనేజీ, సీసీరోడ్లు, విద్యుత్ సౌకర్యాలు కల్పించారు. అలాగే 11 లిఫ్ట్లను సైతం ఏర్పాటు చేశారు. మంత్రులు డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించి, లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించి, అందజేయనున్నారు.