హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు మంత్రులు సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలు ఈ కొత్త సంవత్సరంలో తాము అనుకున్న లక్ష్యాలు సాధించాలని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మంత్రి సత్యవతి ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు చూడాలనే సంకల్పంతో దేశం గర్వించేలా గొప్ప సంక్షేమ, అభివృద్ధి పథకాలతో సీఎం కేసీఆర్.. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. నూతన ఏడాదిలోనైనా ప్రతిపక్షాలకు మంచి ఆలోచనలు రావాలని, ప్రజలకు ఉపయోగపడేలా ప్రభుత్వాన్ని నడిపించడంలో నిర్మాణాత్మక పాత్ర పోషించాలని కోరారు.
ఈ 2022 ప్రజలకు శుభాలు, సంతోషాలు, ఆనందాలు నింపే సంవత్సరం కావాలని, ప్రతి ఇళ్లు సిరి సంపదలతో నిండాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరికి కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలిపారు.