హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నిండాలని ఆయన ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా దీపావళి జరుపుకోవడం మన సంప్రదాయమన్నారు.
సమృద్ధికి సంకేతమైన లక్ష్మీదేవిని ఆరాధించడం, కేదారీశ్వర వ్రతాలు చేయడం కూడా దీపావళి పండగ విశిష్టత అన్నారు. ప్రజలందరు పండుగను సంతోషంగా జరుపుకోవాలని, పటాకులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకొవాలని వారు సూచించారు.