హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రైవేటు ఉపాధ్యాయులు, సిబ్బందికి ప్రభుత్వం అందిస్తామన్న సాయంపై మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్ శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రులు సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఏప్రిల్ నుంచే ప్రైవేట్ టీచర్లకు సాయం అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఇందుకుగాను నెలకు రూ.42 కోట్లు అవసరమవుతాయని అంచనా అన్నారు. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రైవేటు విద్యాసంస్థల్లో 1.45 లక్షల మంది పనిచేస్తున్నారని అంచనా. రేషన్ దుకాణాలవారీగా లబ్దిదారులను గుర్తించాలని, ఏర్పాట్లు సిద్ధం చేయాలని కలెక్టర్లు, అధికారులను మంత్రులు ఆదేశించారు.