హైదరాబాద్ : సీపీఐ నేత నారాయణ సతీమణి వసుమతి అనారోగ్యంతో ఇవాళ తిరుపతిలో మృతి చెందారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. రేపు నగరి మండలం ఐనంబాకంలో అంత్యక్రియలు జరుగనున్నాయి. ఆమె మృతిపై తెలంగాణ రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని ప్రకటించారు.