తిరుపతి: రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తిరుమల ఆలయాన్ని దర్శించుకున్నారు. శనివారం నాడు కుటుంబ సమేతంగా తిరుమలలో ఉదయం బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్నారు. పండితుల వద్ద వేదాశీర్వాదాలు తీసుకున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరు సుభిక్షంగా ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.