నిజామాబాద్ : కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం భీంగల్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం లక్ష్మీనరసింహస్వామిని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దర్శించుకున్నారు. లింబాద్రి గుట్టకు కాలినడకన వచ్చిన మంత్రికి పూజారులు వేదమంత్రోచ్ఛరణతో స్వాగతం పలికారు.
అనంతరం గిరిప్రదక్షిణ చేసిన మంత్రి వేముల యాత్రికులను పలకరిస్తూ వసతులపై ఆరా తీశారు. గతంలో లింబాద్రిగుట్ట కు కనీస సౌకర్యాలు లేకపోగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వసతులు మెరుగయ్యాయని మంత్రి తెలిపారు.