నిజామాబాద్ : గోదారమ్మ ఎదురు ఎక్కుతదని కలలో కూడా ఊహించలేదు. నేడు అది నిజమైంది. రైతుల కల నెర వెరిన రోజు ఇది అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. గురువారం ఎస్సారెస్పీ వరద కాలువకు కాళేశ్వరం జలాలు చేరుకోవడంతో జిల్లాలోని కమ్మర్పల్లి మండలం ఉప్లుర్ వద్ద కాళేశ్వరం జలాలకు మంత్రి పూజలు చేసి మాట్లాడారు.
నా హయాంలో ఎస్సారెస్పీ పునర్జీవం పనులు పూర్తి అవటంఅదృష్టం గా భావిస్తున్నానని తెలిపారు. 2001 లో సీఎం కేసీఆర్ఇ చ్చిన మాట నిల బెట్టుకొని రైతుల గుండెల్లో చిరస్మనియ స్థానం సంపాదించారని ప్రశంసించారు. 300 కిలో మీటర్లు రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని తరలించడం చాలా గొప్ప విషయం. ఇక వర్షాలతో సంబంధం లేకుండా సంవత్సరం పొడువునా రైతులకు సాగు నీరు అందుతుందని చెప్పారు.
కాళేశ్వరంతో కేసీఆర్కు మంచి పేరు వస్తుందనే ప్రతి పక్షాలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయన మండిపడ్డారు. రూ. 90 వేల కోట్లతో పనులు జరిగితే లక్ష కోట్ల అవినీతి జరిగింది అనటం హాస్యాస్పదం. ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేస్తే అంతకు రెట్టింపు అభివృద్ధి చేసి చూపిస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళ నాడుతో పాటు యావత్ దేశ రైతులు కొనియాడుతున్నారు. ఎప్పటికైనా దేశ రైతాంగానికి కేసీఆరే శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు. రైతులు ప్రతి పక్షాల అరోపణలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. అన్నదాతకు అన్ని విధాల అండగా నిలుస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా నిలువాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.