హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆలోచనల నుంచి పుట్టిన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తెలంగాణకు మరో మణిహారం అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ప్రపంచ స్థాయి ప్రముఖ అద్భుత కట్టడాల్లో ఇది ఒకటిగా నిలిచిపోతుందని కొనియాడారు. దుబాయ్కు బుర్జ్ ఖలీఫా, పారిస్కు ఈఫిల్ టవర్ ఎలానో హైదరాబాద్కు కమాండ్ కంట్రోల్ సెంటర్ అంతటి కీర్తిని తెస్తుందని చెప్పారు.
ఈ సెంటర్ 14వ అంతస్థు నుండి చూస్తే హైదరాబాద్ నగరం నలువైపులా ఆకర్షణీయంగా కనిపిస్తుందని వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి గురువారం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈస్ట్-వెస్ట్ గ్రాండ్ ఎంట్రీ పోర్టిగో పనుల్లో వేగం పెంచాలని, గ్రౌండ్ ఫ్లోర్లోని మీడియా బ్రీఫింగ్ రూమ్, ఆడిటోరియం నిర్మాణ ఫినిషింగ్ వర్స్ను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 18వ అంతస్థు వరకు ఫ్లోర్ల వారీగా పనులను పరిశీలించారు.
ఫ్లోర్ వైస్ క్లాడింగ్, ఫాల్స్ సీలింగ్, ఫ్లోరింగ్, మిగిలిన సివిల్ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను, వర్ ఏజెన్సీని ఆదేశించారు. నాలుగో ఫ్లోర్లో డాటాసెంటర్కు సంబంధించిన సెక్యూరిటీ అంశాలపై డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీ సీవీ ఆనంద్ పలు సూచనలు చేయగా, ఆ అంశాలు పరిగణనలోకి తీసుకోవాలని ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతిరెడ్డిని మంత్రి ఆదేశించారు. ఏడో ఫ్లోర్లో సీఎం, వీవీఐపీ చాంబర్స్, 18వ ఫ్లోర్లో సీపీ చాంబర్, నాలుగో ఫ్లోర్లో డీజీపీ చాంబర్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. డాటా సెంటర్ కోసం బెల్జియం, జర్మనీ నుంచి తెప్పించే ఇంపోర్టెడ్ పరికరాలను త్వరగా తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మ్యాన్ పవర్ పెంచి ఫినిషింగ్ వర్స్ త్వరగా పూర్తి చేయాలని, సీఎం కేసీఆర్ విధించిన గడువులోగా నిర్మాణం పూర్తి కావాలని అధికారులు, వర్ ఏజెన్సీకి స్పష్టం చేశారు.