ఎన్నికల్లో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి అండగా ఉంటామని ఏకగ్రీవ తీర్మానాన్ని సోమవారం డీసీసీబీ డైరెక్టర్ శేఖర్రెడ్డికి అందజేస్తున్న నిజామాబాద్ జిల్లా సోన్పేట్కు చెందిన 45 మంది మాదిగ సంఘం సభ్యులు. వారితోపాటు బాల్కొండ మండలం వన్నెల్(బీ)లో గంగపుత్ర సంఘానికి చెందిన 104 కుటుంబాలు, మెండోరా మండలంలోని దూద్గాంకు చెందిన గంగపుత్రులు, మెండోరాకు చెందిన 30 మంది మున్నూరు కాపు సంఘం సభ్యులు, 47 మంది గంగపుత్ర సంఘం సభ్యులు, మోర్తాడ్ మండలం ధర్మోరా గ్రామానికి చెందిన యాదవ సంఘం, శెట్పల్లి గ్రామానికి చెందిన గురిజాల సంఘం, హరిజన సంఘాలు, ఏర్గట్ల మండలంలోని తొర్తి గ్రామానికి చెందిన 9 కుల సంఘాలు కూడా వేములను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని తీర్మానాలు చేశాయి.
-బాల్కొండ/మెండోరా/మోర్తాడ్/ఏర్గట్ల