హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని మోదీ సర్కార్ చెప్తున్న అభివృద్ధి కేవలం కాగితాలకే పరిమితమైందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణలో జాతీయ రహదారుల కోసం రూ.1,25,000 కోట్లు కాగితాల మీద మంజూరు చేసిందని, అందు లో ఖర్చు చేసింది కేవలం 20 వేల కోట్లేనని చెప్పారు. శనివారం మంత్రుల నివాస సముదాయంలో ఆయన మీడియాతో మా ట్లాడారు. ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడైన మోదీ.. అవినీతి గు రించి మాట్లాడడం ఆశ్చర్యంగా ఉన్నదని ఎద్దేవాచేశారు. రాష్ట్రప్రగతిని అడ్డుకున్నది ముమ్మాటికీ మోదీయేనని ఆరోపించారు. సీతాఫల్మండి రైల్వేస్టేషన్లో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి లిఫ్టులు జాతికి అంకితం చేస్తే అడ్డుకున్నమా? బాండ్ రాసి, పసుపు బోర్డు ఇస్తా అంటే అడ్డుకున్నమా? విభజన హామీలు నెరవేరుస్తుంటే అడ్డుకున్నామా? ప్రాజెక్టులకు జాతీయ హోదాను అడ్డుకున్నమా? అని ప్రశ్నించారు.