హైదరాబాద్, జూన్ 21(నమస్తే తెలంగాణ): పేదల సొంతింటి కల నెరవేర్చటమే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన ఆశయమని రాష్ట్ర రోడ్లు, భవనాలు,గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. అందుకే సొంత జాగాలు ఉన్న పేదలకు ఇల్లు నిర్మించుకునేందుకు గృహలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టినట్టు ఆయన ఒక ప్రకటనలో పేర్కొ న్నారు.
ఈ పథకం కేసీఆర్ ప్రభుత్వం పేదలకు అంది స్తున్న వరం లాంటిదని, కేసీఆర్ మానస పుత్రిక అన్నారు. అర్హులైన లబ్ధిదారులకు రూ.3 లక్షల ఆర్థిక సాయం అందిస్తూ.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3 వేల చొప్పున మొత్తం 4 లక్షల ఇండ్ల నిర్మాణానికి రూ. 7,350 కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. నిత్యం పేదల సంక్షేమం కోసమే ఆలోచించే మనసున్న ముఖ్య మం త్రి కేసీఆర్ అని కొనియా డుతూ, గృహలక్ష్మి గైడ్లైన్స్ విడుదల పై సీఎంకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.