హైదరాబాద్ : రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Minister Vemula) మాతృమూర్తి వేముల మంజులమ్మ కొద్ది సేపటి క్రితం హైదరాబాద్లోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మంజులమ్మకునగరంలోని ఓదవాఖానలో చికిత్స అందిస్తున్నారు. కాగా, నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో రేపు ఉదయం అంత్యక్రియలు జరుగనున్నాయి. మంజులమ్మ మృతి పట్ల పలువురు ప్రజాప్రతినిధులు సంతాపం ప్రకటించారు.