నిజామాబాద్ : రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి రోజురోజుకి మద్దతుల వెల్లువ కొనసాగుతున్నది. బీఆర్ఎస్ వెంటే మేమంటూ సబ్బండ వర్ణాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మద్దతు ప్రకటిస్తున్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని గ్రామాల్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ప్రజల నుంచి విశేష మద్దతు లభిస్తున్నది.
అన్ని విధాల అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ పార్టీకి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికే మా మద్దతు అంటూ ఆయా మండలాల్లో గ్రామాల్లోని పలు కుల సంఘాలు స్వచ్ఛందంగా ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నాయి. తాజాగా భీంగల్ మండలం పురానిపేట కుర్మ సంఘం, మెండోర గ్రామ మాల సంఘం సభ్యులు, మోర్తాడ్ మండలం పాలెం గ్రామ ముదిరాజ్ సంఘాల వారు బీఆర్ఎస్ పార్టీ, వేముల ప్రశాంత్ రెడ్డికి ఎన్నికల్లో తన వెంట ఉంటామని ఏకగ్రీవ తీర్మానం చేసిన పత్రాలను ఇచ్చి తమ మద్దతు తెలియజేశారు.