వేల్పూర్ : భారత రాజ్యాంగ నిర్మాత, బహుముఖ ప్రజ్ఞశాలి డాక్టర్ బి.అర్ అంబేద్కర్ అణగారిన వర్గాల ఆశాజ్యోతి అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. అంబేద్కర్ 131వ జయంతి పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో అయన విగ్రహానికి ఘనంగా నివళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డా.బాబా సాహెబ్ అంబేద్కర్ అణగారిన వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడని మంత్రి అన్నారు.
దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన ఆశయాల స్ఫూర్తి తోనే సీఎం కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తున్నదని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దళితులు ఆర్థికంగా ఉన్నతస్థాయిలో ఎదగాలని దళితబంధు లాంటి విప్లవాత్మకమైన కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేపట్టారన్నారు. అంబేద్కర్ ఆశయాలు సాధిస్తామని నినాదాలు చేశారు.