నిజామాబాద్ : జిల్లాలోని బాల్కొండ మండల కేంద్రంలో రూ.8.50 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. కొద్ది రోజుల క్రితం శంకుస్థాపన చేసిన రోడ్డు వెడల్పు పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు.
మెయిన్ రోడ్ నాలుగు వరుసలు వెడల్పు, డివైడర్ సెంట్రల్ లైటింగ్, గ్రామ పంచాయతీ డబుల్ లైన్ రోడ్ పనులతో పాటు రూ.90 లక్షలతో చేపట్టిన అంబేద్కర్ రోడ్ పనులను సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి మంత్రి పరిశీలించారు. రోడ్డు పనులు నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించి పలు సూచనలు చేసారు.