నిజామాబాద్ : పల్లె ప్రగతి కార్యక్రమం ప్రారంభోత్సవంలో భాగంగా రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తన స్వగ్రామం వేల్పూర్లో పర్యటించారు. పంచాయతీ పాలకవర్గాన్ని వెంటబెట్టుకుని గ్రామంలో కలియతిరిగారు. వేల్పూర్లో డ్రైనేజీ వ్యవస్థ, చెత్త సేకరణ పని తీరును అధికారులను ప్రజాప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. పలు కాలనీల్లో తిరిగి ప్రజల సమస్యలు ఆలకించారు. పరిశుభ్రతకు ప్రతి ఒక్కరు పాటుపడాలని పిలుపునిచ్చారు.