నిజామాబాద్ : రైతులు ఎవరు అధైర్య పడొద్దు అండగా ఉంటామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. జిల్లాలోని ఏర్గట్ల మండలం దోంచంద గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట ముంపునకు గురైన ప్రాంతాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. గ్రామస్తులు, రైతులతో మాట్లాడారు. పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అధిక వరదల నేపథ్యంలో పంట పొలాల్లో ఇసుక మేటలు పేరుకుపోవడాన్ని పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. బాధిత రైతులకు అన్ని విధాల అండగా ఉంటామని భరోసా కల్పించారు. మంత్రి ఆదేశాల మేరకు ఇటీవల జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, సెంట్రల్ కమిటీ అధికారులు వర్ష ప్రభావిత ప్రాంతాలని పరిశీలించిన సంగతి తెలిసిందే.