కోదాడ, ఫిబ్రవరి 7 : కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించలేదని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. బుధవారం కోదాడ పట్టణంలో వంద పడకల దవాఖానకు శంకుస్థాపన చేసిన ఆయన అనంతరం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహతో కలిసి మీడియాతో మాట్లాడారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు కృష్ణా జలాల పంపిణీపై తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణ కంటే ఆంధ్రాకే ఎక్కువ మేలు జరిగిందని తెలిపారు. కేసీఆర్, ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డికి మధ్య ఉన్న సాన్నిహిత్యంతో కృష్ణా జలాలు ఏపీకి ఎక్కువ వాటా వెళ్తుందని ఆరోపించారు. కృష్ణా జలాల దోపిడీని కేసీఆర్ అరికట్టలేక పోయారని విమర్శించారు. కేసీఆర్ మేడిగడ్డపైనా మాట్లాడాలని డిమాండ్ చేశారు.