హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఫ్రాన్స్ హూఫర్ హెన్రిచ్ హెర్జ్ ఇనిస్టిట్యూట్కు చెందిన పరిశోధన బృందం శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. వ్యవసాయానికి సంబంధించి పలు అంశాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా పరిశోధన బృందానికి నేతృత్వం వహిస్తున్న ఇంటరాక్టీవ్ అండ్ కాంగ్నిటీవ్ సిస్టం హెడ్ డాక్టర్ సెబాస్టియన్ బాసీ, వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ చిలగంటి ఏసీఆర్ఏటీ (ఎక్సలరేటింగ్ ైక్లెమేట్ రిసిలియంట్ అగ్రికల్చర్ ఇన్ తెలంగాణ) తెలంగాణ రైతాంగానికి, జీవావరణానికి కలిగే ప్రయోజనాలను మంత్రికి వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విపరీతమైన రసాయనిక ఎరువులు, పురుగుల మందుల వాడకంతోపాటు విచ్చల విడిగా నీటి వాడకం వల్ల నాణ్యమైన దిగుబడులు రావడం లేదని తెలిపారు. పూర్వికులు ఆచరించిన పద్ధతులు, నవీన సాంకేతికతను వాడుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. అలాంటి ప్రాజెక్టుల కోసం తెలంగాణ ప్రభుత్వం తన వంతు సహకారం అందిస్తుందని మంత్రి తెలిపారు.