హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): విత్తన కంపెనీల లైసెన్స్లను సమగ్రంగా పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న కంపెనీల లైసెన్స్లను రద్దు చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులకు ఆయా కంపెనీల నుంచి నష్టపరిహారం ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాల మాట వినిపించొద్దని, ఎక్కడిక్కడ తనిఖీలు నిర్వహించి సరఫరా చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. యాసంగి సీజన్తోపాటు రాబోయే వానకాలం సీజన్కు అవసరమైన నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని కోరారు.
మంగళవారం సచివాలయంలో విత్తనరంగ అభివృద్ధిపై తు మ్మల సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని కంపెనీలు ఇక్కడి రైతుల అవసరాలు తీర్చిన తర్వాతే ఎగుమతి చేసుకోవాలని చెప్పారు. విత్తనాలకు మార్కెట్ సెస్ నుంచి మినహాయింపు ఇవ్వాలని సమావేశానికి హాజరైన విత్తన కంపెనీల ప్రతినిధులు మంత్రికి విజ్ఞప్తిచేశారు. సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, డైరెక్టర్ గోపి, విత్తనాభివృద్ది సంస్థ ఎండీ కేశవు లు, నూజివీడు సీడ్స్ ఎండీ ప్రభాకర్రావు, కా వేరీ సీడ్స్ ఎండీ భాస్కర్రావు, రాశి సీడ్స్ సీవో వో ఏఎస్ఎన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.