Minister Tummala Nageswara rao | హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): ముడి పామాయిల్ దిగుమతిపై సుంకాలను రద్దు చేయడం వల్ల దేశ ఆయిల్పామ్ రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ మేరకు రద్దు చేసిన దిగుమతి సుంకాన్ని మళ్లీ పునరుద్ధరించి పామాయిల్ దిగుమతులను తగ్గించాలని కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు శనివారం కేంద్ర ప్రభుత్వానికి మంత్రి లేఖ రాశారు.