హైదరాబాద్: దేశంలో ప్రైవేటు దేవాలయాలకు ఆర్థిక సాయంత అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం ఉదయం సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో ప్రభుత్వ ఆర్థిక సాయం చెక్కులను అందజేసిన సందర్భంగా మంత్రి మాట్లాడారు. అమ్మవారికి సమర్పించనున్న చీర తయారీని ఆయన మగ్గంపై ప్రారంభించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడగానే సీఎం కేసీఆర్ బోనాల పండుగను రాష్ట్ర పండుగా ప్రకటించారని మంత్రి తలసాని గుర్తుచేశారు.
దాంతో తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పే బోనాలు నేడు విశ్వవ్యాప్తం అయ్యాయని అన్నారు. పండుగలు గొప్పగా జరుపుకోవాలి, ప్రజలు సంతోషంగా ఉండాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని చెప్పారు. బోనాలను ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఆలయాలకు ఆర్థిక సాయం కోసం ప్రభుత్వం రూ.15 కోట్లు విడుదల చేసిందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బోనాలకు పండుగకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మంత్రి చెప్పారు.